Tuesday, March 1, 2011

వడ్డి తాండ్ర ప్రజలకు జేజేలు..

తూర్పు తీరం మరో సారి పోటెత్తింది. అభివృద్ధి పేరుతో థర్మల్ కేంద్రం.. దాని సాకుతో భూముల సేకరణ.. వీటన్నిటికి శ్రీకాకుళం ప్రజలు మరోసారి బ్రేక్ వేసారు. గృహదహనాలు.. పోలీసు కాల్పులకు బెదరబోమన్నారు. పదిరోజుల నుంచే వడ్డితాండ్ర.. సమీప గ్రామాల్లో 144వ సెక్షన్ అమలు చేస్తున్నారు. సంత బొమ్మాళి మండలంలోని తంపర గ్రామాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ప్రజలను భయభ్రాంతుల్ని చేసారు. చివరికి ఇద్దరు ప్రజల్ని ప్లాస్టిక్ బుల్లెట్స్ తో బలిగొన్నారు. స్థానిక నాయుకుల మద్ధతు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సంఘీభావం.. అన్యూహంగా ప్రభుత్వంపై వత్తిడి పెంచింది. దాంతో కేంద్రప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఈ విజయం సంతబొమ్మాళి తంపర వాసులది. వారికి నైతిక మద్ధతు ఇచ్చిన తెలుగు ప్రజలది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలను పునస్సమీక్షించుకోవాలి. అభివృద్ధి.. ప్రజల ప్రయోజనాలు పరస్పర వ్యతిరేకం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రజలు ఎన్నుకున్న నాయుకులది. ఆ విషయం విస్మరిస్తే వడ్డితాండ్రలు పునరావృతమవుతూనే ఉంటాయి.

No comments:

Post a Comment